భారత్, ఇంగ్లండ్ సెమీ-ఫైనల్.. 6.52 కోట్ల మంది వీక్షించారు..
v6velugu·7 Mar 2026·1 min read·0
గురువారం భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ డిజిటల్ క్రీడా వీక్షణలో సరికొత్త రికార్డు సృష్టించింది.
'రెండో సెమీ-ఫైనల్ను డిజిటల్గా వీక్షించిన వారి సంఖ్య ప్రపంచ రికార్డును నెలకొల్పింది. భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ను గరిష్టంగా 6.52 కోట్ల మంది ప్రజలు ఒకేసారి వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఏ మ్యాచ్ కూడా ఇంతటి వీక్షకులను నమోదు చేయలేదు. అత్యున్నత స్థాయి అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లు భారీ సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఇది నిరూపించింది. ఈ టోర్నమెంట్ నిర్వాహకులకు మరియు ప్రసార భాగస్వాములకు మా ధన్యవాదాలు. ఐసీసీలో మా బృందం కూడా విజయవంతంగా పనిచేసింది’ అని ఐసీసీ ఛైర్మన్ జై షా వెల్లడించారు.